Friday, 28 March 2025

భీంరావ్ సార్ సన్మానం

తేదీ:27-3-2025 గురు వారం రోజున మంచిర్యాల జిల్లా డి సి ఈ బి కార్యదర్శి శ్రీ కొండు భీం రావ్ గారి ఉద్యోగ పదవీ విరమణ కార్యక్రమానికి ఎస్ టి యు టి ఎస్ మంచిర్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బట్టారి వెంకటేశ్వర్లు మరియు చీపెళ్లి బాపు లు హాజరై వారు ఉపాధ్యాయులుగా పిల్లలకు అందించిన సేవలను గుర్తు చేశారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షునిగా శ్రీ కొండు భీంరావ్ గారు ఉపాధ్యాయులకు అందించిన విశిష్ట సేవలు మరువలేనివి అని కొనియాడారు. తదనంతరం వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వరంగల్ ఆర్జెడి సత్యనారాయణ రెడ్డిగారు మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య గారు, మంచిర్యాల మండల విద్యాధికారి వి ఎస్ వి మాలవి దేవి గారు ఎస్ టి యు జిల్లా గౌరవ అధ్యక్షులు వరహాల కరుణాకర్ గారు,జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షులు ఏ సత్తయ్య గారు, జిల్లా ఉపాధ్యక్షులు వి పద్మ గారు, బి మన్మోహన్ గారు, కె మహాలక్ష్మి గారు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి ఎం సుమన్ గారు, జిల్లా కార్యదర్శిలు డి స్వప్న దేవిగారు , టి జయ గారు జిల్లా ఆర్థిక కమిటీ సభ్యులు పి సుజాత గారు, డి గంగుతాయి గారు మంచిర్యాల మండల అధ్యక్షులు ఆర్ మల్లేశం గారు, కార్యవర్గ సభ్యులు పి విశ్వనాథ్ గారు,ఓ కృష్ణ గారు, శోభారాణి గారు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment