Friday, 28 March 2025
STUTS.రాష్ట్రోపాధ్యాయ సంఘం, తెలంగాణ. మంచిర్యాల జిల్లా శాఖ............ ప్రథమ కార్యవర్గ సమావేశం తేది 7-3-2025
రాష్ట్రోపాధ్యాయ సంఘం, తెలంగాణ. మంచిర్యాల జిల్లా శాఖ............
ప్రథమ కార్యవర్గ సమావేశం తేదీ07-3-2025......................ప్రధాన కార్యదర్శి నివేదిక....
తేది 23-11-2024 రోజున నూతన జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఎన్నిక, ప్రభుత్వ ఉన్నత పాఠశాల గర్మిళ్ల లో జరిగింది. జిల్లా అధ్యక్షులుగా శ్రీ బట్టరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా చీపెళ్లి బాపు అను నేను రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పార్వతి రెడ్డి గారు మరియు రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో ఎన్నుకోబడ్డాము. అప్పటి మాజి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ శంకర్ గౌడ్ మరియు వెంకటేశ్వర్లు మాకిచ్చిన రెవెన్యూ సున్నా. నూతనంగా ఎన్నికైన మేమిద్దరం, తేది 08-12-2024 రోజున జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హైదరాబాదులోని కాచిగూడ లో గల ఎస్ టి యు భవనం నందు హాజరై ప్రసంగించాము.తేది 18-12-2024 గౌరవ మంచిర్యాల విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్ యాదయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం తదనంతరం ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించమని కోరడం జరిగింది.తేది 26-12-2024 రోజున సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల దీక్షకు మద్దతుగా కలెక్టరేట్ వద్ద గల వారి శిబిరానికి వెళ్లి మద్దతు ప్రకటించడం జరిగింది. ఇదే రోజు సాయంత్రం రాష్ట్రోపాధ్యాయ సంఘం నిర్వహించే గూగుల్ మీట్ సమావేశంలో పాల్గొని డైరీ మరియు క్యాలెండర్ ల గురించి మాట్లాడడం జరిగింది. మరుసటి రోజు నుండి డైరీ మరియు క్యాలెండర్ల కొరకు గౌరవ ఎస్టీయు సభ్యుల నుండి రూపాయలు 8000 చందాల స్వీకరించి డైరీ లను తెప్పించుకోవడం మరియు క్యాలెండర్లను ప్రింట్ చేయించుకోవడం జరిగింది.తేది 03-01-2025 రోజున గౌరవ మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారి చేతులమీదుగా డైరీని ఆవిష్కరింప చేయడం జరిగింది.తేది 04-01-2025 రోజున గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా డైరీ మరియు క్యాలెండర్లను ఆవిష్కరింప చేయడం జరిగింది.తేది 05-01-2024 రోజున మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ యాదయ్య గారి చేతుల మీదుగా డైరీలు మరియు క్యాలెండర్లు ఆవిష్కరించడం జరిగింది.తేది 17-01-2024 రోజున రాష్ట్రఉపాధ్యాయ సంఘం పిలుపుమేరకు ఎమ్మెల్సీ ఎన్నికల రివ్యూ మరియు అభ్యర్థి ఎంపిక తదితర అంశాలపై రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్ నందు గల కాచిగూడలో ఎస్టీయు భవన్ కు హాజరు కావడం జరిగింది. మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎస్టీయూమద్దతు అభ్యర్థి ప్రకటన సందర్భంగా కరీంనగర్ పీకాక్ హోటల్ కుతేది 02-02-2025 రోజునహాజరు కావడం జరిగింది.తేది 10-02-2025 రోజున ఎమ్మెల్సీ అభ్యర్థి కూర రఘోతంరెడ్డి గారి నామినేషన్ సందర్భంగా కరీంనగర్ కు వెళ్లడం జరిగింది. తేది 11-02-2025 నుండితేది 16-2-2025 వరకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించి ఎమ్మెల్సీ ప్రచారం చేయడం జరిగింది. ఇదే రోజు STUTS నిర్వహించే గూగుల్ మీట్ లో పాల్గొనడం జరిగింది.17-02-2025 నుండి23-02-2025 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు జూనియర్ కాలేజీలు అట్లాగే డిగ్రీ కాలేజీలను సందర్శించి క్యాంపెన్ చేయడం జరిగింది.తేది 24-02-2025 నుండి 26-02-2025 వరకు ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ సందర్శించి పోలింగ్ బూత్ లో ఏజెంట్లను నియామకం చేయడం జరిగింది అట్లాగే ప్రతి పోలింగ్ స్టేషన్ ముందు టెంట్ మరియు కుర్చీలు వేయించడం జరిగింది.తేది 27-02-2025 రోజున మా వంతు సహకారం జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్ లలో చేయడం జరిగింది.తేది 07-03-2025 రోజున రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల గర్మిల్లా నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 18 మంది మహిళా ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల మండల విద్యాధికారిని వి ఎస్ వి మాలవి దేవి గారు హాజరు కావడం జరిగింది. అలాగే రెవిన్యూ విషయానికొస్తే చందాలుగా వచ్చినఎనిమిది వేల రూపాయలు(8000), డైరీలకు మరియు క్యాలెండర్లకు ఖ xర్చు కాగా ప్రస్తుత రెవెన్యూ బ్యాలెన్స్ సున్నా అని కార్యవర్గ సమావేశంలోపాల్గొన్న సభ్యులచే ఆమోదింపడం జరిగింది...........................................................................
ఇట్లు చీపెల్లి బాపు జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్టోపాధ్యాయ సంఘం మంచిర్యాల జిల్లా శాఖ......
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment